ఇడుపులపాయ నేలమాళిగలో జగన్కు కోట్లు: దేవినేని
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో ఉన్న వారంతా కళంకిత మంత్రులేనని పయ్యావుల కేశవ్ మీడియా పాయింట్ వద్ద అన్నారు. ఇదే విషయాన్ని తాము మొదటి నుండి చెబుతున్నామన్నారు. నోటీసులు అందుకున్న మంత్రులు వెంటనే తప్పుకోవాలని లేదా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వారిని స్వయంగా తప్పించాలని డిమాండ్ చేశారు. వైయస్ తాను తింటూ మంత్రులకు తినిపించారన్నారు. నోటీసులు అందుకున్న మంత్రులే కాకుండా మరికొందరు కూడా ఉన్నారని, వారి పైనా చర్యలు తీసుకోవాలన్నారు. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఐదేళ్ల కాలంలో కాంగ్రెసు భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడిందన్నారు. ఇప్పుడు కూడా అదే అవినీతి ఇప్పటి ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. నిందితులు చంచల్ గూడ జైలుకు వెళ్లక తప్పదన్నారు.
సుప్రీం కోర్టు నోటీసుల పాపం జగన్మోహన్ రెడ్డిదేనని కోడెల శివప్రసాద్ అన్నారు. ఐఏఎస్ అధికారులు జైలుకెళ్లడానికి కారణం ఆయనే అన్నారు. జగన్ ఒత్తిడి కారణంగానే అక్రమ జివోలు జారీ చేశారని ఆరోపించారు. నోటీసులు అందుకున్న మంత్రులను ముఖ్యమంత్రి వెంటనే మంత్రివర్గం బర్తరఫ్ చేయాలని కెఇ కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. వారు ఫైళ్లను మాయం చేసే అవకాశముందన్నారు.