జగన్ కేసులో మంత్రులకు నోటీసులు: సభలో దుమారం

ప్రజల్లో టిడిపి పట్ల విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు. ఇప్పటికైనా వారు బుద్ది తెచ్చుకోవాలన్నారు. ఏ ప్రాంతానికి వెళ్లిన ప్రజలు టిడిపి, చంద్రబాబు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. సాక్ష్యాలు తీసుకోవడానికే సుప్రీం నోటీసులు జారీ చేసిందని, దోషులను ఇంకా తేల్చలేదన్నారు. ఎవరేమిటో ప్రజలకు తెలుసునని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. నోటీసులకు సమాధానం ఇస్తామని చెప్పారు. సభలో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఎలాంటి పరిణామాలనైనా తాము, మంత్రులు కోర్టులో, సభలో ఎదుర్కోవడానికైనా సిద్ధమన్నారు. కాగా టిడిపి ఎమ్మెల్యేలు రాజీనామాకు పట్టుబడుతూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో స్పీకర్ సభను పది నిమిషాలు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications