జగన్ కేసులో మంత్రులకు నోటీసు: సభలో గందరగోళం

స్పీకర్ నాదెండ్ల మనోహర్ విపక్ష సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. సభను సవ్యంగా జరపాలా వద్దా అని వారిని ప్రశ్నించారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలన్నారు. అయితే వారు మాత్రం కళంకిత మంత్రులు రాజీనామా చేయాల్సిందేనని స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. దీంతో స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేశారు. విపక్షాలు మంత్రుల రాజీనామాకు పట్టుబట్టిన సమయంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రైవేటు వ్యక్తి వేసిన పిటిషన్ను ప్రత్యేక కోర్టు కొట్టి వేసిందని చెప్పారు. మంత్రులు రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. జివోలు సభలో పెట్టే అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడి చెప్తానని విపక్షాలకు స్పీకర్ చెప్పారు.












Click it and Unblock the Notifications