తెలంగాణ కోరుకుంటున్నారని తెలుసు: సిఎం కామెంట్

Kiran Kumar Reddy
మహబూబ్‌నగర్: తెలంగాణపై పార్టీ అధిష్టానందే తుది నిర్ణయమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అన్నారు. కాంగ్రెసు పార్టీ అభ్యర్థి తరఫున ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడి ప్రజలు తెలంగాణ కోరుకుంటున్నారని కానీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వంటి అబద్దాలు చెప్పే వ్యక్తిని కాదని విమర్శించారు. కాంగ్రెసు పార్టీకి ఓటేస్తే కొల్లాపూర్ అభివృద్ధి చెందుతుందన్నారు. కొల్లాపూర్‌ను అభివృద్ధి చేసే బాధ్యత నాది అని విష్ణువర్ధన్‌ రెడ్డిని గెలిపించే బాధ్యత మీది అన్నారు. కొల్లాపూర్ ప్రజలు ఎవరికీ భయపడరన్నారు. ఎవరైనా భయపెడితే ఓటుతో సమాధానం చెప్పండన్నారు. తాను చంద్రబాబులా అబద్దాలు మాట్లాడనన్నారు. అభివృద్ధిపై ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటానన్నారు. కొల్లాపూర్ ప్రజలు తెలంగాణ కోరుతున్నారని తెలుసునని, దీనిని కేంద్రానికి తెలియజేస్తానని చెప్పారు. రూ.193 కోట్ల రూపాయలతో కొల్లాపూర్ - కర్నూలు వంతెనను నిర్మిస్తామన్నారు. రూ.58 కోట్లతో కొల్లాపూర్ రోడ్లు బాగు చేస్తామని హామీ ఇచ్చారు.

కాగా అంతకుముందు పలువురు యువకులు కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతుండగా జై తెలంగాణ నినాదాలు చేశారు. ఆంధ్రా తొత్తుల్లారా ఖబర్దార్ అన్నారు. ఆ తర్వాత ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు వర్గీకరణకు అనుకూలంగా నినాదాలు చేశారు. కాంగ్రెసు ఆలస్యం చేయకుండా వర్గీకరణకు తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. అక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా ఉండేందుకు పోలీసులు నినాదాలు చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ముఖ్యమంత్రి అక్కడి నుండి నాగర్ కర్నూల్ వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+