వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాయ ఆస్తులు రూ. 111 కోట్లు, 380 క్యారట్ల వజ్రాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Mayawati
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బిఎస్పీ అధినేత మాయావతి తన ఆస్తులను వెల్లడించారు. రాజ్యసభకు నామినేషన్ వేసిన ఆమె మంగళవారం తన ఆస్తులు, నగదు, ఆభరణాల వివరాలను వెల్లడించారు. గత రెండేళ్లలో ఆమె ఆస్తులు రూ. 24 కోట్లు పెరిగాయి. దాంతో ఆమె ఆస్తుల విలువ రూ. 111 కోట్లకు చేరుకుంది. తనకు 380 క్యారట్ల వజ్రాలు ఉన్నట్లు ఆమె తెలిపారు. ఆమెకు ఒక కిలో బంగారం కూడా ఉంది. ఆమె వెండి డిన్నర్ సెట్ 20 కిలోలు ఉంటుంది. దాని విలువ రూ. 9 లక్షలు

ఆమె స్థిరాస్తుల విలువ రూ. 96 కోట్ల మేరకు ఉంటుంది. ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో రెండు దుకాణాలున్నాయి. సర్దార్ పటేల్ మార్గ్‌లో రూ. 62 కోట్ల విలువ చేసే ఇల్లు ఉంది. లక్నోలోని ఇంటి విలువ రూ. 15 కోట్లు ఉంటుంది. 2010 మేలో ఆమె ఆస్తుల విలువ రూ. 87 కోట్లు. మాయావతి మంగళవారం ఉదయం రాజ్యసభకు నామినేషన్ వేశారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలు కావడంతో ఆమె ఢిల్లీలోనే ఉండాలని అనుకుంటున్నట్లు సమాచారం. జాతీయ రాజకీయాల్లో తృతీయ కూటమి ఏర్పాటు చర్చ ముందుకు వచ్చిన నేపథ్యంలో ఢిల్లీ రాజకీయాలపై దృష్టి పెట్టాలని ఆమె అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

English summary
In the last two years former chief minister of UP Mayawati assets have shot up 24 crores, with this her assets value reached to rs 111 crores.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X