డిఎల్ సంచలన వ్యాఖ్యలు, తెలంగాణపై పార్టీకి సూచన

DL Ravindra Reddy
హైదరాబాద్: మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరిగిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవూరు నియోజకవర్గంతో పాటు తెలంగాణ ప్రాంతంలోని ఆరు నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం ఆయన మాట్లాడారు. ఏడు స్థానాలలో కాంగ్రెసు ఒక్కచోట కూడా గెలవకపోవడంపై ఆయన స్పందిస్తూ.. ఈ ఉప ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి గుణపాఠం కావాలని అన్నారు. ఉప ఎన్నికలలో వచ్చిన ఫలితాలపై కాంగ్రెసు పార్టీ నేతలు అందరూ ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు.

నేతలు పార్టీలోని కేడర్‌కు ఆత్మవిశ్వాసం కల్పించకపోతే కాంగ్రెసుకు తీవ్ర నష్టం కలిగే అవకాశముందన్నారు. పార్టీ కష్టాల్లో కూరుకు పోతుందన్నారు. అయితే నాయకత్వ మార్పు సమస్యకు పరిష్కారం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. నాయకత్వ మార్పు వల్ల వచ్చేదేమీ లేదన్నారు. కేడర్‌లో విశ్వాసం కల్పిస్తే చాలన్నారు. ఉప ఎన్నికల్లో ఓటమిని ఆషామాషీగా తీసుకోవద్దని అన్నారు. ఓటమికి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు. రాజీనామా చేయాలా లేదా అన్నది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రివర్గం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామాలు అధిష్టానానికి పంపాలన్నారు. తెలంగాణపై కూడా అధిష్టానం ఆలోచించాలని డిఎల్ సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+