చివరి ఎన్నికలు వారికే: చంద్రబాబు వ్యాఖ్యలపై కెసిఆర్

మహబూబ్నగర్లో తెలంగాణవాదమే గెలిచిందని, కొద్ది మెజారిటీతో తమ పార్టీ ఓడిపోయిందని ఆయన అన్నారు. ప్రజలు తెలంగాణవాదాన్ని బలపరిచారని, ఈ విషయాన్ని గుర్తించి తెలుగుదేశం, కాంగ్రెసు నాయకులు బయటకు రావాలని ఆయన అన్నారు. ఎత్తిన జెండా దించకుండా తెలంగాణ రాష్ట్ర సాధన వైపు సాగుతామని ఆయన చెప్పారు. ఆదిలాబాద్ నుంచి కొల్లాపూర్ వరకు ప్రజలు తెలంగాణవాదాన్నే గెలిపించారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల సహనాన్ని పరీక్షించవద్దని ఆయన ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రతిపాదించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ప్రధానిని, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు తనపై నీలాపనిందలు వేశారని, గోబెల్స్ ప్రచారం చేశారని, అయినా తెలంగాణ ప్రజలు తెలుగుదేశం పార్టీని విశ్వసించలేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీకి మూడు చోట్ల డిపాజిట్ పోయిందని, రెండు చోట్ల మూడో స్థానంలో నిలిచిందని, దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీని ప్రజలు విశ్వసించలేదని తేలిపోయిందని ఆయన అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీ నాయకులకు జ్ఝానోదయం కలిగించాలని ఆయన ఆశించారు.












Click it and Unblock the Notifications