విశ్వసనీయతకు పట్టం: కోవూరు ఫలితంపై వైయస్ జగన్

విలువలకు, విశ్వసనీయతకు ప్రజలు పట్టం కట్టారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి అన్నారు. వైయస్సార్ను గుండెల్లో పెట్టుకుని ప్రజలు ఓటేశారని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, చిరంజీవి ప్రచారం చేసినా కోవూరులో కాంగ్రెసు ఓడిపోయిందని ఆమె అన్నారు. వైయస్ జగన్కు చెందిన సాక్షి మీడియా తప్పుడు వార్తా కథనాలు తన అపజయానికి పనికి చేశాయని తెలుగుదేశం పార్టీ కోవూరు అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications