టివి యాంకర్పై కత్తితో దాడి చేసిన భర్త, విషమం
కాగా గతంలో తన భర్త వద్ద న్యూడ్ సిడిలు ఉన్నాయని, సీక్రెట్ కెమెరాలతో వాటిని తీసాడని తన భర్తపై టీవీ యాంకర్ పోలీస్ కంప్లైంట్ చేసి మీడియాకెక్కటం సంచలనం రేపిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే టీవి యాంకర్ మేఘనా రెడ్డి ఓ పాపులర్ టీవీ ఛానెల్ లో పనిచేస్తోంది. ఆమె భర్త కట్నం ఇంకా తెమ్మంటూ వేధిస్తున్నాడని సిసియస్ ఉమెన్ పోలీస్ స్టేషన్ బషీర్ బాగ్ లో కంప్లైంట్ చేసింది. ఆమె భర్త కోటీలో భార్గవీ సర్వీస్ సెంటర్ నడుపుతాడు. అక్కడ హ్యాండీ క్యామ్ సర్వీస్, సేల్స్ చేస్తూంటారు. ఆమె తన కంప్లైంట్లో... మా వివాహం అయ్యాక, ఆయన నన్ను మరింత కట్నం తెమ్మని వేధించాడు. కొద్ది రోజుల తర్వాత నేను కొన్ని న్యూడ్ సీడిలు చూడటం జరిగింది. దానిపై ఆయన్ని ప్రశ్నించాను. ఆయన వాటిని ఎవరికీ లీక్ చేయద్దని నన్ను బెదిరించాడు. అంతేగాక తనకు ఈస్ట్ జోన్ ఎసిపి సపోర్టు ఉందని మరీ బెదిరించాడని చెప్పింది. అలాగే తను సికింద్రాబాద్ లో ఇద్దరు పిల్లలుతో ఉంటున్నాని చెప్పుకొచ్చింది. అంతేగాక అమ్మాయిలను న్యూడ్ గా ఇలా కెమెరాలో బంధించి ఆ తర్వాత వారిని వ్యభిచారం చెయ్యమంటూ బ్లాక్ మెయిల్ చేస్తూంటాడని చెప్పుకొచ్చింది. ఇక తరుచుగా తన భర్త బ్యాంకాక్, మలేషియాకి లగ్జరీ టూర్స్ నిమిత్తం వెళ్తూంటాడని ఆ కంప్లైంట్లో వివరించింది. వివరాలు తాను రుజువులతో సహా మీడియాకు వెల్లడిస్తానని చెప్పింది.