జగన్ సాధించాడు, ముఖ్యమంత్రి అవుతారు: నల్లపురెడ్డి

Nallapureddy Prasanna Kumar Reddy
నెల్లూరు: రాష్ట్ర ప్రజలు తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవూరు ఉప ఎన్నికల్లో గెలుపొందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బుధవారం అన్నారు. ఇది తన విజయం కాదని, జగన్ సాధించిన విజయమని అన్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ కలిసి ఎన్ని కుట్రలు పన్నినప్పటికీ ప్రజలు వారిని నమ్మలేదని అన్నారు. ఆ పార్టీలకు తగిన బుద్ధి చెప్పారన్నారు. రానున్న పదిహేడు నియోజకవర్గాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులే గెలుస్తారని చెప్పారు. కొవూరు గెలుపు ఆ విజయాలకు నాంది అన్నారు. ప్రజలు విశ్వసనీయతకు పట్టం కట్టారన్నారు.

కొవూరు గెలుపు తమ పార్టీకి కీలక మలుపు అని మరో నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అన్నారు. 2014లో జగన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. కాగా కొవూరులో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయనకు 73,876 ఓట్లు వచ్చాయి. 23,496 ఓట్లతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై విజయం సాధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+