ఢిల్లీ బాట పట్టనున్న కిరణ్ వ్యతిరేక వర్గం, ఫిర్యాదుకే!

కిరణ్ను ముఖ్యమంత్రి స్థానం తొలగించాలని మొదటి నుండి లక్ష్యంగా పెట్టుకున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కూడా 29న ఢిల్లీ వెళ్లనున్నారని సమాచారం. ముఖ్యమంత్రిని ఖచ్చితంగా మార్చాల్సిందేనని, అప్పుడే రాష్ట్రంలో పార్టీ పరిస్థితి మెరుగు పడుతుందని ఆయన తన వాణి వినిపించనున్నారని తెలిస్తోంది. సిఎంను మార్చేందుకు అధిష్టానం అంగీకరించని పక్షంలో అక్కడికి అక్కడే పార్టీకి రాజీనామా చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సిఎంను తప్పించకుంటే తాను కాంగ్రెసుకు రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు సిఎంపై అసంతృప్తితో ఉన్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ 30వ తేదిన ఢిల్లీ వెళ్లే అవకాశముంది.












Click it and Unblock the Notifications