సమావేశంలో ఎప్పుడూ చర్చించలేదు: అంబటి
మార్కెటింగ్కు సంబంధించిన విషయాలు బోర్డు సమావేశంలో ఎప్పుడూ చర్చకు రాలేదన్నారు. ఎండి కానీ, ఇతర సభ్యులు కానీ ఈ వివరాలను బోర్డు దృష్టికి తీసుకు రాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ఎండిని ఈ స్పెషల్ పర్పస్ వెహికల్లో సభ్యుడిగా నియమించిందని, అందువల్ల ఆయనకు కచ్చితంగా విల్లాలు, ప్లాట్ల ధరల గురించి కచ్చితంగా తెలిసి ఉండాలన్నారు. బోర్డు సమావేశంలో ఆయన వీటి గురించి చెప్పి ఉంటే సమష్ఠిగా ఓ నిర్ణయం తీసుకునే వాళ్లమని అంబటి వివరణ ఇచ్చారు. ఇక ఎమ్మార్ హిల్స్ టౌన్షిప్, ఎమ్మార్ ఎంజీఎఫ్ ల్యాండ్ లిమిటెడ్ మధ్య ఒప్పందం కుదిరేనాటికి ఎపిఐఐసి చైర్మన్గా నా పదవీ కాలం ముగిసిందని చెప్పారు. ఇందులో ప్రభుత్వ నామినేటెడ్ సభ్యుడిగా ఉన్న ఆచార్యనే ఎపిఐఐసి తరఫున దీనిపై నిర్ణయం తీసుకోవాలన్నది తన అభిప్రాయమన్నారు.
ఎపిఐఐసి చైర్మన్గా తన పదవీ కాలం ముగిసిన తర్వాతే తన సోదరుడు మురళీ కృష్ణ అక్కడ ప్లాటు కొన్నారని చెప్పారు. తన తమ్ముడు కాంట్రాక్టర్ అని, నేరుగా స్టైలిష్ హోమ్స్ను గానీ, ఎమ్మార్ ఎంజీఎఫ్ను కానీ సంప్రదించి ప్లాట్ కొని ఉంటారన్నారు. ఈ విషయంతో తనకు ఎలాంటి సంబంధం లేదని అంబటి స్పష్టం చేశారు.