బొత్స, కిరణ్ ఫైట్: ఉప ఎన్నికలపై పార్టీలో ఆందోళన

అదేవిధంగా తెలంగాణలోని వరంగల్ జిల్లాలో పరకాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. నిజానికి, తాజాగా జరిగిన ఏడు శాసనసభా నియోజకవర్గాల ఫలితాలు కాంగ్రెస్ను రాజకీయంగా అనిశ్చిత పరిస్థితిలోకి నెట్టాయి. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పరాజయం పాలైతే, రాష్ట్రంలో ఆ పార్టీ కుప్పకూలే ప్రమాదం ఉంది. ఉప ఎన్నికలు జరగాల్సి ఉన్న అసెంబ్లీ స్థానాలూ కాంగ్రెస్కే చెందినవి కావడంతో గెలిచి తీరాల్సిన అవసరం ఆ పార్టీకి ఉంది. ఇలాంటి కీలక సమయంలో మద్యం ముడుపుల కేసు వ్యవహరం బొత్స, కిరణ్ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను తారస్థాయికి తీసుకెళ్లింది.
ప్రస్తుతం పార్టీలోని రాష్ట్ర సారథుల మధ్య నెలకొన్న అనైక్యత ఇదే విధంగా కొనసాగితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రతికూల ఫలితాలు వస్తాయని ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీకి పలువురు రాష్ట్ర నేతలు ఇప్పటికే చెప్పారట. దీంతో, ఎప్పుడూ లేని విధంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ ఆజాద్ ఉప పోరు విషయమై రంగంలోకి దిగారు. కాంగ్రెస్లోని రాష్ట్ర ఎంపీలతో ఢిల్లీలో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఆజాద్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎంపీలు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిపై ఆందోళన వెలుబుచ్చారు. ప్రధానంగా సిఎం, పిసిసి చీఫ్ మధ్య ఉన్న విభేదాలపై వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం పరిస్థితిని చక్కదిద్ది పార్టీ రాష్ట్ర సారథుల మధ్య సయోధ్య నెలకొల్పాలని ఆజాద్కు ఎంపీలు సూచించారు.












Click it and Unblock the Notifications