సిబిఐకి సోమవారం సాక్షి మీడియా స్టాఫ్పై నివేదిక
జగన్కు చెందిన ఐదు మీడియా సంస్థల ఉద్యోగు వివరాలను అందించాలని సిబిఐ కోరింది. సాక్షి దినపత్రికను ప్రచురించే జగతి పబ్లికేషన్స్లో 126 మంది, సాక్షి టీవీని నడిపే ఇందిరా టెలివిజన్ను నడిపే ఇందిరా టెలివిజన్లో 540 మంది ఉద్యోగులు, రిజల్యూట్ మీడియాలో 837 మంది ఉద్యోగులు, గార్నెట్ మీడియాలో 1047 మంది ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలు బహుశా హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయాలకు సంబంధించినవే కావచ్చు. కాగా, జననీ ఇన్ఫ్రాకు సంబంధించిన వివరాలు తెలియడం లేదు.
ఇదిలావుంటే, సిబిఐ అడిగిన ప్రశ్నలకు నివేదిక రూపంలో సమాధానం ఇచ్చేందుకు కార్మిక శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు ఏడుగురు జాయింట్ కమిషనర్లు, 24 మంది డిప్యూటీ కమిషనర్లను నియోగించినట్లు కార్మిక శాఖ తెలిపింది. రెండువ శనివారం, ఆదివారం సెలవు రోజులైనా వీరంతా సమాచారణ సేకరణలో ఉంటారని కార్మిక శాఖ ప్రకటించింది.
జగన్ మీడియా సంస్థల్లో ప్రత్యక్షంగా ఎంత మంది, పరోక్షంగా ఎంత మంది పనిచేస్తున్నారు, కార్మిక చట్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారా తదితర వివరాలను తెలియజేస్తూ సిబిఐకి సోమవారం నివేదిక సమర్పిస్తామని కార్మిక శాఖ అధికారులు అంటున్నారు. సాక్షి మీడియా ఉద్యోగుల వివరాలను సిబిఐ ఎందుకు అడిగిందనే విషయంపై ఇంకా సందేహాలు కొనసాగుతూనే ఉన్నాయి.