అలహాబాదులో బాంబు పేలుడు: ఆరుగురు మృతి
నాటు బాంబును చెత్తకుండీలో పెట్టినట్లు సమాచారం. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాధితులు ఎక్కువగా పిల్లలే. ముఠా తగాదాల కారణంగా ఈ బాంబు పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. చెత్త ఏరుకునే పిల్లలు ఎక్కువగా ఉన్నారు. స్థానిక అధికార యంత్రాంగం, పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
పేలుడు సంభవించిన ప్రాంతాన్ని పోలీసులు దిగ్బంధం చేశారు. సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. లక్్నో నుంచి అహ్మాదాబాద్కు ఫోరెన్సిక్ నిపుణులు హుటాహుటిన బయలుదేరారు. చెత్తకుండీ వద్ద కొంత మంది పిల్లలు అడుకుంటుండగా, బుధవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. తక్కువ తీవ్ర గల బాంబు కావడంతో నష్టం భారీగా లేదని అంటున్నారు.
తాజా బాంబు పేలుడుతో అలహాబాద్లో హైఅలర్ట్ ప్రకటించారు. ప్రత్యక్ష సాక్షులను పోలీసులు విచారిస్తున్నారు. పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు ఏ తీవ్రవాద సంస్థ కూడా ప్రకటన చేయలేదు. అయితే, తీవ్రవాద సంస్థ కోణం నుంచి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.