మంగలి కృష్ణకు పాస్పోర్టు జారీపై సిఐడి దర్యాప్తు

దంతలూరి కృష్ణకు పాస్పోర్టు జారీ కావడంలో కడప జిల్లా పోలీసుల పాత్రపై సిఐడి అధికారులు విచారిస్తున్నారు. పోలీసు వెరిఫికేషన్ చేసింది ఆ జిల్లావాళ్లే కాబట్టి ఆ దిశగా సిఐడి అధికారులు ఆలోచన చేస్తున్నారు. కడప జిల్లా పులివెందులకు చెందిన మంగలి కృష్ణ 2001 సూట్కేసు బాంబు కేసులో నిందితుడు. ఆయుధాల చట్టం కింద కూడా అతనిపై పలు కేసులున్నాయి.
కర్ణాటకలోని పాత మంగళూర్ ఓడరేవు నుంచి మంగలి కృష్ణ విదేశీ తయారీ ఆయుధాలను కూడా స్మగుల్ చేసినట్లు సిఐడి అధికారులు భావిస్తున్నారు. వాటిని మద్దెలచెర్వు సూరికి, భాను కిరణ్కు సరఫరా చేసినట్లు తెలుస్తోంది. వివిధ సెటిల్మెంట్లలో, డబ్బు వసూలులో తన పాత్ర ఉందని కృష్ణ అంగీకరించినట్లు తెలుస్తోంది.
సుధాకర్ నాయుడు, సీన అనే వ్యక్తులు మంగలి కృష్ణకు ఆయుధాలు సరఫరా చేసినట్లు, వాటిని అతను సూరికి, భాను కిరణ్కు అందించినట్లు చెబుతున్నారు. మంగలి కృష్ణను సిఐడి అధికారులు బుధవారం కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతనికి జూన్ 6వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో అతన్ని చర్లపల్లి జైలుకు తరలించారు.
-
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే












Click it and Unblock the Notifications