రెండో రోజు విచారణకు దిల్కుషాకు చేరుకున్న జగన్
కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి, కాంగ్రెసు ఏలూరు శాసనసభ్యుడు ఆళ్లనాని జగన్ నివాసానికి వచ్చారు. వారితో పాటు జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి కూడా వైయస్ జగన్తో సమావేశమయ్యారు. ఎస్వీ సుబ్బారెడ్డి వంటి పలువురు నాయకులు వైయస్ జగన్ను కలిశారు. జగన్ను సిబిఐ విచారిస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.
శుక్రవారం తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అధికారులు విచారించలేదని వైయస్ జగన్ చెప్పారు. సిబిఐ మాత్రమే విచారించిందని ఆయన చెప్పినట్లు సమాచారం. వైయస్ జగన్ను ఈ రోజు కూడా సాయంత్రం వరకు విచారిస్తామని సిబిఐ వర్గాలు చెబుతున్నాయి.
వైయస్ జగన్ను సిబిఐ అధికారులు శుక్రవారం ఏడున్నర గంటలకు పైగా విచారించారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో అరెస్టయిన పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, అధికారి బ్రహ్మానంద రెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణలతో కలిపి కూడా వైయస్ జగన్ను విచారించారు. విడిగా జగన్ను సిబిఐ అధికారులు చాలాసేపు విచారించారు.