తిరుమలలో తోపులాట, సొమ్మసిల్లిన ఐదుగురు భక్తులు
దర్శనానికి విపరీతమైన సమయం తీసుకుంటుండడంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఆందోళనకు గరువుతున్న క్రమంలోనే తోపులాట జరిగింది. క్యూలైన్లు సరిగా నిర్వహించడం లేదని తెలుస్తోంది. ఎక్కడ పడితే అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి దాదాపు 22 గంటల సమయం పడుతోంది. వైకుంఠం దగ్గరకు వచ్చే సరికి భక్తుల ఉత్కంఠ పెరుగుతోంది. తనిఖీలు నిర్వహిస్తున్న ఇవో ఎల్వీ సుబ్రహ్మణ్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు దర్శనం తొందరగా జరగడం లేదని వారు చెప్పారు. వారికి ఇవో సర్ది చెప్పారు.
ఇదిలా ఉంటే తిరుపతిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాంగ్రెసు కార్యకర్తలు బాణసంచా పేల్చడంతో ఈ ప్రమాదం సంభవించింది. బాణసంచా పేల్చడంతో నిప్పురవ్వలు పడి దాబాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.