చివరి రోజు విచారణకు జగన్: పొన్నాల కూడా, కలిసి...

విచారణ తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడతానని చెప్పారు. కోర్టులను తాము గౌరవిస్తామని చెప్పారు. నవ్వుతూ వెళితే మేకపోతు గాంభీర్యం అంటారని, లేదంటే ఆందోళనగా ఉన్నారని అంటారని పొన్నాల మీడియాతో చలోక్తులు వేశారు. మరోవైపు ఐఏఎస్ అధికారి ఆదిత్యనాద్ దాస్ కూడా సిబిఐ విచారణకు హాజరయ్యారు.
కాగా చంచల్గూడ జైలులో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను సిబిఐ అధికారులు నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఇదే కేసు విషయమై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమై చర్చిస్తున్నట్లుగా సమాచారం. ఇక చంచల్గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అధికారులు ఐదో రోజు తమ కస్టడీలోకి తీసుకున్నారు.
అతనిని బుల్లెట్ ప్రూఫ్ ప్రత్యేక వాహనంలో జైలు నుండి కోఠిలోని సిబిఐ కార్యాలయానికి తరలించారు. పొన్నాల లక్ష్మయ్య దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో భారీ నీటి పారుదల శాఖామాత్యులుగా పని చేశారు. ఆయన నిబంధనలకు విరుద్ధంగా ఇండియన్ సిమెంట్ ఫ్యాక్టరీకి నీళ్లు ఇచ్చేందుకు జివోలపై సంతకాలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. జగన్ను, పొన్నాలను కలిసి విచారించే అవకాశముంది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications