మీ కోసమే చిరంజీవి వచ్చారు: బొత్స, జగన్పై నిప్పులు

దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ, ఆమె కూతురు షర్మిల మాటలతో సానుభూతి రాదన్నారు. మీ కోసమే చిరంజీవి వచ్చారని ఓటర్లను ఉద్దేశించి అన్నారు. మేమంతా ప్రజల కోసమే వచ్చామని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసుకు వెన్నెముక లేదన్నారు. పార్టీ పూర్తి పేరు చెప్పుకోలేని స్థితిలో వైయస్సార్ కాంగ్రెసు ఉందన్నారు.
వైయస్ జగన్ పాపం పండింది కాబట్టే జైలుకు వెళ్లాడని చిరంజీవి అన్నారు. మీరంతా న్యాయం వైపు ఓటు వేయండని ప్రజలకు సూచించారు. ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రావడం శుభప్రదమని వ్యాఖ్యానించారు. మూడేళ్ల పాటు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించిన తాజా మాజీ ఎమ్మెల్యే ఈ నియోజకవర్గం అభివృద్దిని ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెసు అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడిని గెలిపిస్తే అభివృద్ధిపై దృష్టి సారిస్తారని చెప్పారు.
జగన్ భారీగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. వైయస్ జగన్, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి అవినీతికి కవల పిల్లలు అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ కుటుంబం తమ ఆస్తిని జాతికి అంకితమిస్తే, జగన్, గాలిలు మాత్రం జాతి సంపదను నిర్దాక్షిణ్యంగా దోచుకున్నారన్నారు. వేలకోట్ల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications