అక్రమసంబంధం అనుమానంతో భార్య హత్య, రైళ్లలో చోరీ

Guntur Map
గుంటూరు/ఖమ్మం: అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఓ భార్యను భర్త కత్తితో నరికి చంపిన సంఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని వడ్లమూరివారిపాలెం గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివసిస్తున్న ఆదెమ్మపై ఆమె భర్త అనుమానం పెంచుకున్నాడు. దీంతో శనివారం రాత్రి కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం భర్త స్థానిక పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు.

మరోవైపు కడప జిల్లాలో ఓ భర్త తన భార్య, తన రెండేళ్ల చిన్నారని చంపివేశాడు. జిల్లాలోని ప్రొద్దుటూరు మండలం నక్కలదిన్నె గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భర్త ఉదయం తన భార్యను, రెండేళ్ల చిన్నారని హత్య చేసి.. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతోనే ఇలా జరిగినట్లు తెలస్తోంది.

కాగా ఖమ్మం జిల్లాలోని పావటపల్లి వద్ద రెండు రైళ్లలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. హైదరాబాద్ - విశాఖపట్నం ప్రత్యేక రైలును పావటపల్లి వద్ద దుండగులు చైన్ లాగి ఆపివేశారు. ఎస్ 2, ఎస్ 3, ఎస్ 4, ఎస్ 8, ఎస్ 9 బోగీలలో ప్రయాణీకుల నుండి ఆరు కాసుల బంగారాన్ని దోచుకు వెళ్లారు.

మరోవైపు విజయవాడ - కాజీపేట పుష్‌పుల్ రైలులో కూడా మరికొందరు దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఖమ్మం జిల్లా గార్ల మండలం గోపాలపురానికి చెందిన సుజాత అనే ప్రయాణీకురాలు మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. కిటికీ పక్కన కూర్చున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+