జగన్ ఎమ్మెల్యే కారు అడ్డగింపు, రోడ్డుపై బైఠాయింపు

తాను ఎమ్మెల్యేనని గుర్నాథ్ రెడ్డి సిబ్బందికి చెప్పారు. స్టిక్కర్ లేకపోవడంతో టోల్ ఫీజు చెల్లించాలని వారు పట్టుబట్టారు. దీంతో గుర్నాథ్ రెడ్డి రహదారి పైనే బైఠాయించారు. ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇది తెలిసిన పోలీసులు రంగంలోకి దిగారు. వారు జోక్యం చేసుకొని గుర్నాథ్ రెడ్డిని అక్కడి నుండి వెళ్లేందుకు అనుమతించడంతో పరిస్థితి సద్దుమణిగింది.
కాగా ప్రజల వద్దే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సూచించారని తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో అన్నారు. జగన్ ఆదేశాల మేరకు వార్డు బాట చేపట్టానని, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తానని చెప్పారు. నిధుల విషయంలో ప్రభుత్వం కక్ష సాధింపునకు పాల్పడితే మెడలు వంచుతామన్నారు. కాంగ్రెసుకు ఓట్లు వేయలేదని ఆ పార్టీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, వారికి తగిన బుద్ధి చెబుతామన్నారు.
విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పిట్టల దొర వేషాలు, కాకి లెక్కలు మానుకోవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత జలీల్ ఖాన్ విజయవాడలో హితవు పలికారు. జగన్కు ఉన్నది సానుభూతి కాదని ప్రజాధరణ అన్నారు. తాజా ఉప ఎన్నికలలో గెలిచిన వారు 2009 ఎన్నికల కంటే 30 శాతం ఓట్లు అధికంగా తెచ్చుకున్నారన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ బొమ్మతో తిరిగిన కాంగ్రెసుకు రెండు సీట్లే వచ్చాయన్నారు.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications