జగన్ ఎమ్మెల్యే కారు అడ్డగింపు, రోడ్డుపై బైఠాయింపు

తాను ఎమ్మెల్యేనని గుర్నాథ్ రెడ్డి సిబ్బందికి చెప్పారు. స్టిక్కర్ లేకపోవడంతో టోల్ ఫీజు చెల్లించాలని వారు పట్టుబట్టారు. దీంతో గుర్నాథ్ రెడ్డి రహదారి పైనే బైఠాయించారు. ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇది తెలిసిన పోలీసులు రంగంలోకి దిగారు. వారు జోక్యం చేసుకొని గుర్నాథ్ రెడ్డిని అక్కడి నుండి వెళ్లేందుకు అనుమతించడంతో పరిస్థితి సద్దుమణిగింది.
కాగా ప్రజల వద్దే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సూచించారని తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో అన్నారు. జగన్ ఆదేశాల మేరకు వార్డు బాట చేపట్టానని, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తానని చెప్పారు. నిధుల విషయంలో ప్రభుత్వం కక్ష సాధింపునకు పాల్పడితే మెడలు వంచుతామన్నారు. కాంగ్రెసుకు ఓట్లు వేయలేదని ఆ పార్టీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, వారికి తగిన బుద్ధి చెబుతామన్నారు.
విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పిట్టల దొర వేషాలు, కాకి లెక్కలు మానుకోవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత జలీల్ ఖాన్ విజయవాడలో హితవు పలికారు. జగన్కు ఉన్నది సానుభూతి కాదని ప్రజాధరణ అన్నారు. తాజా ఉప ఎన్నికలలో గెలిచిన వారు 2009 ఎన్నికల కంటే 30 శాతం ఓట్లు అధికంగా తెచ్చుకున్నారన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ బొమ్మతో తిరిగిన కాంగ్రెసుకు రెండు సీట్లే వచ్చాయన్నారు.
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం!












Click it and Unblock the Notifications