ఉగండాలో హైదరాబాదీ రాజేందర్ రెడ్డి సజీవ దహనం

నల్గొండ జిల్లా పోచంపల్లి మండలం పల్లెగూడ గ్రామానికి చెందిన అప్పిరెడ్డి కృష్ణారెడ్డి, సుశీల దంపతులు పదేళ్ల క్రితం హైదరాబాద్కు వలసవచ్చారు. నాగోల్ బండ్లగూ డ ఇంద్రప్రస్థ కాలనీలో ఇల్లు నిర్మించుకుని స్థిరపడ్డారు. వారికి ఇద్దరు కుమారులు.. రాజేందర్రెడ్డి (35), సురేందర్రెడ్డి. వీరిలో రాజేందర్ బోరు బండి ఆపరేటర్గా పనిచేసేవారు. అతనికి భార్య రాణి, కుమారులు రేవంత్రెడ్డి, చరణ్రెడ్డి ఉన్నారు.
సికింద్రాబాదులోని తార్నాకకు చెందిన వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి ఉగాండా దేశ రాజధాని కంపాలాలో ఐదు బోరు బండ్లను నిర్వహిస్తున్నారు. అక్కడ బోరు బండి ఆపరేటర్ అవసరం ఉండటంతో రాజేందర్ని కంపాలాకు తీసుకువెళ్లారు. అక్కణ్నుంచి రాజేందర్ మధ్య మధ్యలో కుటుంబసభ్యులకు ఫోన్ చేసి మాట్లాడేవారు. అలాగు బుధవారం రాత్రి కూడ ఫోన్ చేసి భార్య, పిల్లలతో మాట్లాడారు. కానీ, గురువారం ఉదయాన్నే బోరు బండ్ల యజమాని వెంకటేశ్వరరెడ్డి బావమరిది ప్రభాకర్రెడ్డి రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి అతను అగ్నిప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.
మధ్యాహ్నం మరొకసారి ఫోన్ చేసి రాజేందర్రెడ్డి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ప్రస్తుతం అతని పరిస్థితి సీరియస్గా ఉందని చెప్పారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన రాజేందర్ కుటుంబ సభ్యులు ఉగాండాలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు అతనితో కలిసి పనిచేసే వారికి ఫోన్ చేసి వాకబు చేశారు. గుర్తుతెలియని దుండగులు బోరు బండిని తగలబెట్టారని, ఈ ఘటనలో రాజేందర్ రెడ్డితో పాటు మరో ఇద్దరు కంపాలావాసులు మృతి చెందారని వెల్లడించారు.
బోరు బండి యజమాని వెంకటేశ్వరరెడ్డికి ఫోన్ చేయగా, అతడు ఆత్మహత్య చేసుకున్నాడని, మరో ఐదు రోజుల్లో మృతదేహాన్ని నగరానికి తీసుకుని వస్తానని చెప్పాడు. వెంకటేశ్వరరెడ్డి చెబుతున్న దానికి, రాజేందర్రెడ్డితో పాటు పనిచేస్తున్న వారు చెబుతున్న కథనానికి పొంతన లేకపోవడంతో కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
-
హైదరాబాద్ కు మరో మణిహారం..దేశంలోనే రెండో నెట్ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం.. ఎప్పుడంటే! -
"బీరు"తో పాటు బాటిల్ లోపలే స్టఫ్.. బిత్తరపోయిన మందుబాబు !! -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
విజయవాడలో పోలీసులపై గన్ తో కాల్పులు, వరంగల్ వ్యక్తి అరెస్ట్ -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..!












Click it and Unblock the Notifications