రాష్ట్రపతి ఎన్నిక: వోటింగుకు కెసిఆర్ తెరాస దూరం

యుపిఎ రాష్ట్రపతి అభ్యర్థి తెలంగాణ వ్యతిరేక వైఖరిపై కూడా తెరాస నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. యుపిఎ ప్రభుత్వం ఆగస్టులో లేదా సెప్టెంబర్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తుందని, ఇందుకు సంబంధించిన తనకు స్పష్టమైన సంకేతాలు అందాయని కెసిఆర్ గత కొద్ది రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రణబ్ ముఖర్జీకి అనుకూలంగా ఓటు వేసే ఉద్దేశంతోనే కెసిఆర్ ఇటువంటి ప్రకటన చేస్తున్నారనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి.
అదే సమయంలో తమకు అటువంటి సంకేతాలు ఏవీ లేవని, కెసిఆర్ ప్రకటనలో ఎంత నిజం ఉందనే విషయం తమకు తెలియదని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ అన్నారు. ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమైన నిర్ణయం రాకపోతే తీవ్రమైన విమర్శలకు గురి కావాల్సి వస్తుందనే అభిప్రాయానికి కెసిఆర్ వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో ఓటింగుకు దూరంగా ఉండడమే మంచిదని కూడా ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనకూడదనే అభిప్రాయం పార్టీలో బలంగా ఉందని, అయితే వచ్చే వారం సమావేశమై ఆ విషయంపై నిర్ణయం తీసుకుంటామని పార్టీ నాయకులు అంటున్నారు. తెరాసకు 17 మంది శాసనసభ్యులు, ఓ అనుబంధ శాసనసభ్యుడు ఉన్నారు. ఇద్దరు పార్లమెంటు సభ్యులు - కెసిఆర్, విజయశాంతి ఉన్నారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications