మీకే మా ఓటు: ప్రణబ్ ముఖర్జీకి వైయస్ జగన్ హామీ!

ఇదే విషయాన్ని ప్రణబ్కు కూడా చెప్పారని అంటున్నారు. గత గురువారం అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి కలిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రోజే అతను ప్రణబ్ దాదాను కలిశారు. ఈ సందర్భంగా జగన్ తరఫున సబ్బం దాదాకు హామీ ఇచ్చారని అంటున్నారు.
రాష్ట్రపతి ఎన్నికలలో మీకు ఓటేస్తామని చెప్పమని జగన్ తనను పంపించారని, పార్టీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని దాదాకు సబ్బం చెప్పారని అంటున్నారు. తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండేందుకు దాదాపు నిర్ణయం తీసుకున్నాయని తెలుస్తోంది.
కాగా యుపిఏ తరఫున ప్రణబ్, ఎన్డీయే తరఫున పిఏ సంగ్మా రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఇటీవల హైదరాబాద్ వచ్చిన సంగ్మా తనకు మద్దతివ్వాల్సిందిగా ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మను కలిసి అడిగారు. అనంతరం జైలులో ఉన్న జగన్ను కలిసేందుకు సంగ్మా వెళ్లారు. కానీ ములాఖత్లు ముగియడంతో జైలు అధికారులు అనుమతివ్వలేదు. దీంతో అతను జగన్ను కలవకుండానే వెనుదిరిగారు. జూలై 1న వచ్చిన ప్రణబ్ కూడా విజయమ్మకు ఫోన్ చేసి మద్దతు కోరారు.












Click it and Unblock the Notifications