హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజకీయ క్రీడే గొప్ప కానీ, వ్యాపారం కాదు: కిరణ్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: క్రీడలన్నింటి కంటే రాజకీయ క్రీడే గొప్పదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం అన్నారు. ఇది వ్యక్తి ఎదుగుదలకు దోహదపడుతుందన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం రాష్ట్ర యువజన కాంగ్రెస్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. రాష్ట్ర అధ్యక్షునిగా వంశీ చంద్ రెడ్డి, ఉపాధ్యక్షునిగా అనిల్ కుమార్ యాదవ్, ప్రధాన కార్యదర్శులుగా మర్రి పురూరవ రెడ్డి, అమిత్‌ సింగ్, తుమ్మల పద్మ, శామిలీ శంకర్, నరేశ్, భాను ప్రసాద్, సోహైల్ బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు ఏ చిన్న తప్పు చేసినా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు హిత బోధ చేశారు. 2014లో రాష్ట్రం నుంచి కేంద్రానికి పెద్ద ఎత్తున ఎంపీలను గెలిపించి ఇస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. ఈ లక్ష్యం సాధించడంలో యువజన కాంగ్రెస్ పాత్ర చాలా పెద్దదని చెప్పారు. ప్రభుత్వంలో ఉంటాం, పోతామని, పార్టీని నమ్ముకోవాల్సిన అవసరం ఉందన్నారు.

క్రీడలన్నింటి కంటే రాజకీయ క్రీడే గొప్పదని.. ఇది వ్యక్తి ఎదుగుదలకు దోహదపడుతుందన్నారు. పదవులు వచ్చేవరకూ కష్టపడి పనిచేయాలని సూచించారు. హైదరాబాద్, ఢిల్లీల్లో ఉంటూ లాబీయింగ్ చేస్తే పదవులు వస్తాయనుకుంటే పొరపాటన్నారు. రాజకీయాలంటే వ్యాపారం కానేకాదన్నారు. తాను సామాన్య కార్యకర్తగానే పనిచేస్తానని వంశీ చంద్‌ రెడ్డి అన్నారు.

ఎస్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన సమయంలో తాను తెల్ల కాగితం వంటి వాడినని, పలువురు సీనియర్లు తనను రంగు కాగితాన్ని చేశారని.. ఇప్పుడు గాలి పటంలా రాజకీయ రంగంలో పైకి ఎదిగేందుకు తోడ్పాటును ఇవ్వాలని కోరారు. కాగా ఈ కార్యక్రమానికి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హాజరు కాలేదు. ఆయన ఢిల్లీలో ఉన్నారు.

English summary
CM Kiran Kumar Reddy said that political game is very great with compare to other games. He wassuggested youth congress leaders work for party till get posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X