హైదరాబాద్లో మాయమై అనంతలో తేలిన పిల్లలు
సాయంత్రం వారు ముగ్గురు ఎంతకూ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు స్నేహితుల వద్ద వాకబు చేశారు. రాలేదని చెప్పారు. మరోవైపు పాఠశాల వదిలి చాలా సేపయినప్పటికీ వారి ముగ్గురి సైకిళ్లు అక్కడే ఉండటంతో వాచ్మెన్ అందులోని ఓ విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించాడు.
పాఠశాల నుండి వెళ్లి పోయిన వారు ఇంటికి రాక, స్నేహితుల వద్దకు వెళ్లక ఎక్కడకు వెళ్లారని తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఎంత వెతికినా కనిపించక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు చెప్పకుండా పుట్టపర్తికి వెళ్లి ఉండవచ్చునని లేదా ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండవచ్చునని తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం కూడా తల్లిదండ్రులు పాఠశాల వద్ద తమ పిల్లల కోసం నిరీక్షించారు.
తమ పిల్లలు పుట్టపర్తికి వెళ్లారని కొందరు చెబుతున్నారని, తమకైతే ఆ విషయం తెలియదని, వెళ్లేందుకు డబ్బులు కూడా ఇవ్వలేదని, అయినా అంత చిన్న పిల్లలను అంత దూరం ఎలా పంపిస్తామని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎక్కడున్నా తమకు ఫోన్ చేయాలని, ఇంటికి వస్తే ఏమీ అనమని వారు చెప్పారు.