హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో మాయమై అనంతలో తేలిన పిల్లలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Three seventh class girls missed
హైదరాబాద్: నగరంలోని అంబర్‌పేటకు చెందిన ఓ పాఠశాలలో ఏడవ తరగతి చదవుతున్న ముగ్గురు విద్యార్థినులు అనంతపురంలో తేలారు. తాము అనంతపురం బస్టాండులో ఉన్నట్లు పిల్లలు ఫోన్ చేసి తమ తల్లిదండ్రులకు చెప్పారు. వారు ప్రస్తుతం అనంతపురం పోలీసుల అదుపులో ఉన్నారు. మంగళవారం సాయంత్రం నుండి వారు కనిపించక పోవడం వారి కుటుంబాల్లో ఆందోళన చోటు చేసుకుంది. వారిని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని లేదా చెప్పకుండా పుట్టపర్తికి వెళ్లి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానించారు. అంబరుపేటలోని ప్రయివేటు పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న అర్చన, నిఖిత, శ్రావ్య మంగళవారం పాఠశాలకు వెళ్లారు.

సాయంత్రం వారు ముగ్గురు ఎంతకూ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు స్నేహితుల వద్ద వాకబు చేశారు. రాలేదని చెప్పారు. మరోవైపు పాఠశాల వదిలి చాలా సేపయినప్పటికీ వారి ముగ్గురి సైకిళ్లు అక్కడే ఉండటంతో వాచ్‌మెన్ అందులోని ఓ విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించాడు.

పాఠశాల నుండి వెళ్లి పోయిన వారు ఇంటికి రాక, స్నేహితుల వద్దకు వెళ్లక ఎక్కడకు వెళ్లారని తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఎంత వెతికినా కనిపించక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు చెప్పకుండా పుట్టపర్తికి వెళ్లి ఉండవచ్చునని లేదా ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండవచ్చునని తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం కూడా తల్లిదండ్రులు పాఠశాల వద్ద తమ పిల్లల కోసం నిరీక్షించారు.

తమ పిల్లలు పుట్టపర్తికి వెళ్లారని కొందరు చెబుతున్నారని, తమకైతే ఆ విషయం తెలియదని, వెళ్లేందుకు డబ్బులు కూడా ఇవ్వలేదని, అయినా అంత చిన్న పిల్లలను అంత దూరం ఎలా పంపిస్తామని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎక్కడున్నా తమకు ఫోన్ చేయాలని, ఇంటికి వస్తే ఏమీ అనమని వారు చెప్పారు.

English summary
Three seventh class girl students missed in Amberpet of Hyderabad after complete their school hours on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X