రాజకీమొద్దు: విజయమ్మ, నాశనం చేయాలని.. అంబటి
ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వంద సీట్లను రాజకీయం చేయవద్దని, అవసరమైతే మిగిలిన పార్టీలు కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యాధికారంలో బిసిలకు వంద స్థానాలు రిజర్వేషన్ చేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చారిత్రక నిర్ణయం తీసుకుందని ఆర్.కృష్ణయ్య అన్నారు. ఇతర పార్టీల కంటే ఒక అడుగు ముందుకేసి విజయమ్మ చేసిన ప్రతిపాదనల పట్ల రాష్ట్రంలోని బిసిలందరూ చాలా ఆనందంగా ఉన్నారన్నారు. ఈ విషయంలో పార్టీలు రాజకీయ కోణంలో కాకుండా బిసిల అభివృద్ధి కోణంలో చూడాలన్నారు.
రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఏ క్షణమైనా పడిపోవచ్చునని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వేరుగా అన్నారు. రాష్ట్రంలో పరిపాలన సమర్థవంతంగా లేదని, ఈ విషయం మంత్రులకు, ప్రజలకు తెలుసునన్నారు. 26 జివోలపై ప్రభుత్వం అప్పుడే స్పందించి ఉంటే మంత్రులు జైలుకు వెళ్లే దుస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తును నాశనం చేయాలనే కుట్రకు కాంగ్రెసు తెర తీసిందని, కానీ వారు తీసుకున్న గోతిలో వారే పడ్డారన్నారు.
మంత్రులకు బుద్ధి, జ్ఞానం ఉంటే 26 జివోలపై సమాధానం చెప్పాలని, అప్పుడే ప్రజలు కొంత మేరకు కాంగ్రెసును మన్నించగల్గుతారన్నారు. మంత్రుల ఈ దుస్థితికి కాంగ్రెసు ప్రభుత్వమే కారణమన్నారు. 26 జివోల వల్ల లబ్ధి పొందిన వారు ప్రజలు అని, అందుకే అదే ప్రజలు 2009లో కాంగ్రెసును మళ్లీ గద్దెనెక్కించారన్నారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు మాటలను ఎవరూ నమ్మడం లేదని, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పైన అభాండాలు వేయడం హేయమైన చర్య అన్నారు.