నిద్రిస్తే చనిపోతారు: పుకార్లతో 6జిల్లాల్లో రాత్రంతాజాగారం

నవజాత శిశువు మాట్లాడిందని, రాత్రి నిద్రపోతే ప్రజలు చచ్చిపోతారని చెప్పిందనే పుకార్లు ఈ జిల్లాల్లోని పలు గ్రామాలలో వ్యాపించాయి. అప్పుడే పుట్టిన పాప మాట్లాడటమే వింత అంటే చనిపోతారని చెప్పడం మరింత వింత అని కాబట్టి నిద్ర పోకుండా ఉండటమే ఉత్తమమనే భావనతో ప్రజలు తెల్లవార్లూ జాగారం చేశారు.
పిల్లాపాపలతో ఇంటి బయట, రోడ్ల మీదనే కాలక్షేపం చేశారు. ఇటీవల విజయవాడలో మెహందీ పెట్టుకుంటే అనారోగ్యం పాలవుతునే పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో మెహందీ పెట్టుకున్న పలువురు వెంటనే ఆసుపత్రులకు పరుగెత్తారు. ఇవన్నీ వట్టివేనని, ఇలాంటి పుకార్లను ఎవరూ నమ్మవద్దని పలువురు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications