వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిఎం రాజీనామాకు పట్టు, బిజెపిపై సోనియా ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Parliament
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై పార్లమెంటు ఉభయ సభలు వరుసగా ఆరో రోజు అట్టుడికాయి. ఉభయసభల్లోనూ కార్యకలాపాలు స్తంభించాయి. చివరకు ఉభయ సభలు కూడా వాయిదా పడ్డాయి. బొగ్గు కేటాయింపుల్లో ప్రభుత్వ వైఖరిని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ సమర్థించారు. కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడమే ప్రధాన ప్రతిపక్ష పార్టీ బిజెపి పనిగా పెట్టుకుందని ఆమె దుయ్యబట్టారు. పార్లమెంటరీ వ్యవస్థపై బిజెపికి గౌరవం లేదని, చర్చకు అంగీకరించకుండా బిజెపి పార్లమెంటు వ్యవస్థను అపహాస్యం చేస్తోందని ఆమె విమర్శించారు.

మంగళవారం ఉదయం పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగానే బొగ్గు కుంభకోణంపై దుమారం చెలరేగింది. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలనే తమ డిమాండ్‌పై బిజెపి తన పట్టు వీడలేదు. దీంతో పార్లమెంటు ఉభయ సభలు రెండుసార్లు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు సమావేశమైన రెండు నిమిషాలకే ఉభయ సభలూ వాయిదా పడ్డాయి. లోకసభ, రాజ్యసభ తొలుత గంటసేపు వాయిదా పడ్డాయి.

వాయిదా తర్వాత తిరిగి సమావేశమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. ప్రతిపక్షాలు తమ పట్టు వీడలేదు. దీంతో ఉభయ సభలూ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడ్డాయి. రెండు సార్లు వాయిదా పడి తిరిగి సమావేశమైన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగింది.

ప్రధాని రాజీనామా చేయాలనే తమ పట్టును వీడకుండా ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో స్పీకర్ మీరా కుమార్ లోకసభను గురువారంనాటికి వాయిదా వేశారు. రాజ్యసభను చైర్మన్ అన్సారీ సభను గురువారంనాటికి వాయిదా వేశారు. ఓనం కారణంగా బుధవారంనాడు పార్లమెంటు సమావేశాలు జరగడం లేదు.

English summary
BJP disrupted Parliament proceedings for the sixth day today by creating uproar over coal block allocation issue and pressing for resignation of Prime Minister Manmohan Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X