బాబే కలుస్తారు: 'విలీనం'పై జగన్ పార్టీ, అవమానంలేదు

ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే బాబు దానిని పూర్తిగా విస్మరించారన్నారు. పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు చంద్రబాబు పాదయాత్ర జపం చేస్తున్నారని, కానీ ప్రజలు ఆయనను నమ్మే స్థితిలో లేరన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి చంద్రబాబు మంచి సలహాదారుడు అని విమర్శించారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను కనీసం 30 రోజులైనా నిర్వహించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై చర్చించే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేకుండా పోయిందని, అందుకే సమావేశాలకు వెనుకాడుతోందన్నారు.
మంత్రి వర్గ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలకు కిరణ్ కుమార్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించారని, ఆయన త్వరలోనే బయటకు వస్తారని, ప్రజల అభిమానంతో తమ పార్టీ గెలుపు సాధిస్తుందన్నారు. జగన్ రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలోనూ కీలక నేతగా ఎదుగుతారన్నారు.












Click it and Unblock the Notifications