నేనూ అందరిలాగే ఎదురుచూస్తున్నా: పదవిపై చిరంజీవి

రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మారుస్తారనేది కేవలం ఊహాగానాలు మాత్రమే అన్నారు. మార్పు అంశాన్ని అధిష్టానం ఆలోచించడం లేదన్నారు. ముఖ్యమంత్రికి, మంత్రులకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. అందరూ సమన్వయంతో పని చేస్తున్నారని చెప్పారు. పార్టీలో నాయకులకు, కార్యకర్తలకు మధ్య సమన్వయం ఉండాలని చెప్పారు.
కాగా చిరంజీవికి కేంద్రంలో మంత్రి పదవి వస్తుందని గత కొద్దికాలంగా ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తిరుపతి శాసనసభ్యుడిగా ఉన్న చిరంజీవిని కేంద్రంలోకి తీసుకునేందుకే పార్టీ అధిష్టానం ఆయన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయించి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. ఆయన రాజ్యసభ సభ్యుడు అయినప్పటి నుండి ఆయన మంత్రిపదవిపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అదిగో మంత్రివర్గ విస్తరణ, ఇదిగో మంత్రివర్గ విస్తరణ, ఈసారి చిరంజీవికి తప్పకుండా అవకాశం దక్కుతుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు అతనికి కేంద్రమంత్రి పదవి రాలేదు. చిరును కేబినెట్లోకి తీసుకోక పోవడానికి పలు కారణాలు ఉన్నాయి. పార్టీ సీనియర్లు అడ్డుకోవడం, మంత్రివర్గ విస్తరణ జరగకపోవడం వంటి కారణాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications