క్వాలిస్లో వచ్చి..తపంచా చూపి: విశాఖలో భారీ దోపిడీ
నగర పోలీసు కమిషనర్ పూర్ణచంద్ర రావు స్వయంగా రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ఎస్పీలతో మాట్లాడి ఆయా ప్రాంతాల పోలీసులను అప్రమత్తం చేశారు. అన్ని చెక్ పోస్టుల వద్ద ప్రత్యేక నిఘా పెట్టారు. నిందితులను ఏ క్షణంలోనైనా పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పిన గుర్తులను బట్టి దొంగతనం చేసిన వారిలో ముగ్గురు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.
ఈ సందర్భంగా పూర్ణచంద్ర రావు మాట్లాడుతూ... నగరంలోని అన్ని ప్రాంతాలలో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని తెలిపారు. చుట్టుపక్కల రాష్ట్రాల నుండి గ్యాంగ్ వచ్చినట్లుగా తాము భావిస్తున్నామని చెప్పారు. ఈ దొంగతనం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో జరిగింది. నలుగురిలో ఒకరు తెలుగు మాట్లాడగా మిగిలిన వారు హిందీలో మాట్లాడారని దుకాణ యజమాని చెబుతున్నారు.