వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్వాలిస్‌లో వచ్చి..తపంచా చూపి: విశాఖలో భారీ దోపిడీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vishakapatnam
విశాఖపట్నం: నగరంలోని మురళీనగర్‌లోని నందిత జ్యువెల్లర్స్ దుకాణంలో మంగళవారం పట్టపగలే నలుగురు దొంగలు భారీ దోపిడీకి పాల్పడ్డారు. క్వాలిస్ వాహనంలో వచ్చిన దుండగులు కిలో బంగారం ఎత్తుకెళ్లారు. దుండగులు వచ్చిన వాహనంలోనే గాజువాక వైపుకు వెళ్లినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. దుకాణంలో ఉన్న నలుగురిని తపంచాలతో బెదిరించి, వారి చేతులు కట్టేసి బంగారం ఎత్తుకు పోయారు. దొంగతనం జరిగిన విషయం తెలియగానే పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు.

నగర పోలీసు కమిషనర్ పూర్ణచంద్ర రావు స్వయంగా రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ఎస్పీలతో మాట్లాడి ఆయా ప్రాంతాల పోలీసులను అప్రమత్తం చేశారు. అన్ని చెక్ పోస్టుల వద్ద ప్రత్యేక నిఘా పెట్టారు. నిందితులను ఏ క్షణంలోనైనా పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పిన గుర్తులను బట్టి దొంగతనం చేసిన వారిలో ముగ్గురు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.

ఈ సందర్భంగా పూర్ణచంద్ర రావు మాట్లాడుతూ... నగరంలోని అన్ని ప్రాంతాలలో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని తెలిపారు. చుట్టుపక్కల రాష్ట్రాల నుండి గ్యాంగ్ వచ్చినట్లుగా తాము భావిస్తున్నామని చెప్పారు. ఈ దొంగతనం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో జరిగింది. నలుగురిలో ఒకరు తెలుగు మాట్లాడగా మిగిలిన వారు హిందీలో మాట్లాడారని దుకాణ యజమాని చెబుతున్నారు.

English summary
Four unknown persons theft one kilo gold from Nanditha Jewellers which is located at Murali Nagar of Vishakapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X