Godavari Station: గోదావరి స్టేషన్లో ఈ రైళ్లకు స్టాప్ తొలగింపు..!

రాజమండ్రి వద్ద గోదావరి స్టేషన్ (Godavari Station) చాలా కీలకమైంది. ఇటువైపుగా వెళ్లే చాలా రైళ్లలో ప్రయాణికులు ఇక్కడ దిగుతుంటారు. అయితే ఈ స్టేషన్ లో పలు రైళ్లకు తాత్కాలికంగా స్టాప్ ను తొలగిస్తూ దక్షిణ కోస్తా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రాజమండ్రి స్టేషన్ తో పాటు గోదావరి స్టేషన్లోనూ పుష్కరాల సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్ల నేపథ్యంలో ఆటంకాలు లేకుండా ఈ స్టాప్ ను తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

Narasapur: నరసాపురం ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..! ఇకపై ఆ 4 రైళ్లూ..!
Narasapur: నరసాపురం ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..! ఇకపై ఆ 4 రైళ్లూ..!

ఇలా గోదావరి స్టేషన్లో స్టాప్ తీసేసిన రైళ్లలో కాకినాడ పోర్టు నుంచి విజయవాడకు వెళ్లే మెమూ ఎక్స్ ప్రెస్ రైలు 17258, రాజమండ్రి నుంచి విజయవాడకు వెళ్లే మెమూ రైలు 67201, రాజమండ్రి నుంచి విజయవాడకు వెళ్లే మెమూ రైలు 67261 ఉన్నాయి. ఇందులో కాకినాడ పోర్టు-విజయవాడ రైలుకు ఈ నెల 26 నుంచి ఆగస్టు 9 వరకూ స్టాప్ ను తీసేశారు. అలాగే రాజమండ్రి-విజయవాడ మెమూ రైళ్లకు సైతం ఇలాగే ఈనెల 26 నుంచి ఆగస్టు 9 వరకూ గోదావరి స్టేషన్ స్టాప్ ను రద్దు చేశారు.

Godavari Station Stop Suspended for Select Trains Due to Pushkaram Preparations
కాకినాడ-చర్లపల్లి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!
కాకినాడ-చర్లపల్లి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!

ఇలా మొత్తం 45 రోజుల పాటు ఈ మూడు రైళ్ల ప్రయాణికులకూ గోదావరి స్టేషన్ స్టాప్ అందుబాటులో ఉండదు. కాబట్టి ప్రయాణికులు అందుకు అనుగుణంగా టికెట్లు బుక్ చేసుకుని ప్రయాణాలు చేయాలని అధికారులు కోరుతున్నారు. ఈ విషయాన్ని వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి పుష్కరాల సమయంలో గోదావరి స్టేషన్ ద్వారా ప్రయాణాలు చేసే వారంతా దీన్ని దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+