టెక్కీకి లైంగిక వేధింపు: ఐఏఎస్ అరెస్ట్, 14రోజులు జైలు

టెక్నికల్ ఎడ్యూకేషన్ డిపార్టుమెంట్లో ప్రత్యేక కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న శశి భూషణ్ ప్రయాణంలో తనతో మిస్ బిహేవ్ చేశారని ఆమె ఆరోపించారు. ఇతను ఘాజీయాబాద్లో రైలు ఎక్కారని, అక్కడి నుండి తనను వేధించారని, ఉద్దేశ్య పూర్వకంగా ముట్టుకునే ప్రయత్నాలు చేశారని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు లక్నో రైల్వే పోలీసులు శశి భూషణ్ పైన కేసు నమోదు చేశారు.
కాగా ఐటి ఎగ్జిక్యూటివ్ అయిన మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయడం, రిమాండుకు తరలించడంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం శశి భూషణ్ను విధుల నుండి తప్పించింది. అయితే శశి భూషణ్ మాత్రం లైంగిక ఆరోపణలను ఖండించారు. ఆ మహిళ కులపరమైన వ్యాఖ్యలు చేయడంతో ఆమెతో వాగ్వాదం జరిగిందని చెప్పారు. తాను ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని తెలిపారు. కాగా ఆదివారం రాత్రి ప్రయాణిస్తున్న సమయంలో అసభ్యంగా ప్రవర్తించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. పోలీసులు అతనిని సోమవారం అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications