హైదరాబాద్ తెలంగాణదే: ఆంధ్ర జెఎసి, ఎంపిలపై ఫైర్
తెలంగాణ ప్రాంతానికి గుండెకాయ వంటి హైదరాబాద్పై సీమాంధ్ర ప్రాంతానికి ఎలాంటి హక్కు లేదని సుంకర కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. ఆ విషయంపై ఆయన విజయవాడలో మాట్లాడారు. సీమాంధ్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివ రావులు బాధ్యతారహితంగా హైదరాబాద్పై వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ పక్కాగా తెలంగాణ ప్రాంతానికి చెందిందేనని, దానిపై సీమాంధ్రులకు ఎలాంటి హక్కు లేదన్నారు. తెలంగాణ ప్రాంతానికి హైదరాబాద్ గుండెకాయ వంటిదన్నారు. ఆంధ్ర, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలుంటే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ప్రత్యేక రాజధాని, ప్రభుత్వ కార్యాలయాలు వస్తాయని, దీంతో ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు హైదరాబాదును అడ్డుగా సీమాంధ్ర నాయకులు చూపుతున్నారు. హైదరాబాద్ను తాము అభివృద్ధి చేశామని చెబుతున్నారు. ఈ తరుణంలో సుంకర కృష్ణమూర్తి ప్రకటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.