విద్యుత్తుపై అధికారులకు ముఖ్యమంత్రి క్లాస్

రైతులకు ఏడు గంటలు విద్యుత్తు విధిగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎన్టిపిసికి బొగ్గు సరఫరాను మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకునే విధంగా కోల్ ఇండియా లిమిటెడ్కు ముఖ్యమంత్రి లేఖ రాశారు. వ్యవసాయానికి విధిగా ఏడు గంటలు విద్యుత్తు సరఫరా చేయాలని, డిమాండ్ మేరకు విద్యుత్తును కొనుగోలు చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాపై, సేకరణపై ముఖ్యమంత్రి అధికారులకు క్లాస్ తీసుకున్నారు. విద్యుత్తు కోసం వివిధ ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని సూచించారు. గ్రామాల్లోకి వెళ్లి పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షించాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో విద్యుత్తు పరిస్థితి బాగా లేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అధికారులపై ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
వ్యవసాయానికి ఏడు గంటల పాటు విద్యుత్తు సరిగా అందడం లేదని, పరిస్థితిని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్ కోత అమలవుతోంది. వర్షాలు సరిగా పడకపోవడంతో జలశయాలు అడుగంటి పోయి జల విద్యుత్తు ఉత్పత్రి సరిగా జరగడం లేదు. కరెంట్ కష్టాలు మాత్రం రాష్ట్రంలో తీవ్రంగానే ఉన్నాయి. ఈ స్థితిలో పరిస్థితి ముఖ్యమంత్రి సమీక్షించారు.
-
హైదరాబాద్ కు మరో మణిహారం..దేశంలోనే రెండో నెట్ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం.. ఎప్పుడంటే! -
"బీరు"తో పాటు బాటిల్ లోపలే స్టఫ్.. బిత్తరపోయిన మందుబాబు !! -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
విజయవాడలో పోలీసులపై గన్ తో కాల్పులు, వరంగల్ వ్యక్తి అరెస్ట్ -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!!












Click it and Unblock the Notifications