విద్యుత్తుపై అధికారులకు ముఖ్యమంత్రి క్లాస్

రైతులకు ఏడు గంటలు విద్యుత్తు విధిగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎన్టిపిసికి బొగ్గు సరఫరాను మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకునే విధంగా కోల్ ఇండియా లిమిటెడ్కు ముఖ్యమంత్రి లేఖ రాశారు. వ్యవసాయానికి విధిగా ఏడు గంటలు విద్యుత్తు సరఫరా చేయాలని, డిమాండ్ మేరకు విద్యుత్తును కొనుగోలు చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాపై, సేకరణపై ముఖ్యమంత్రి అధికారులకు క్లాస్ తీసుకున్నారు. విద్యుత్తు కోసం వివిధ ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని సూచించారు. గ్రామాల్లోకి వెళ్లి పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షించాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో విద్యుత్తు పరిస్థితి బాగా లేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అధికారులపై ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
వ్యవసాయానికి ఏడు గంటల పాటు విద్యుత్తు సరిగా అందడం లేదని, పరిస్థితిని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్ కోత అమలవుతోంది. వర్షాలు సరిగా పడకపోవడంతో జలశయాలు అడుగంటి పోయి జల విద్యుత్తు ఉత్పత్రి సరిగా జరగడం లేదు. కరెంట్ కష్టాలు మాత్రం రాష్ట్రంలో తీవ్రంగానే ఉన్నాయి. ఈ స్థితిలో పరిస్థితి ముఖ్యమంత్రి సమీక్షించారు.
-
మూసీ తీరాన మహత్తరం -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications