జగన్పార్టీలో చేరుతున్నా, పొమ్మనలేకే: ఎమ్మెల్యే వనిత

తనను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించినందుకే టిడిపి తనను ఏకంగా పార్టీ నుండి సస్పెండ్ చేసిందని వాపోయారు. తన సొంత నియోజకవర్గంలోనే టిడిపి తనను టార్గెట్ చేస్తోందని, తన స్థానంలో మరొకరిని ప్రోత్సహిస్తుండటంతో మనస్తాపానికి గురయ్యానన్నారు. మహిళా ఎమ్మెల్యే అయినా తాను పార్టీ చేపట్టిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నానని చెప్పారు. పార్టీ విధానాలను ప్రశ్నించిన వారందరినీ వదిలించుకుంటున్నట్లుగా కనిపిస్తోందన్నారు.
కాగా వనిత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడారని చెబుతూ టిడిపి ఆమెను పార్టీ నుండి బహిష్కరించిన విషయం తెలిసిందే.
జగన్ వైపుకు వెళ్లేందుకే వనిత విమర్శలు చేస్తోందని భావించిన పార్టీయే ముందుగా స్పందించి ఆమెను తెలుగుదేశం పార్టీ నుండి బహిష్కరించిందని చెబుతున్నారు. మరోవైపు నాలుగు రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన వనిత.. తన నిర్ణయాన్ని వచ్చే నెల 4వ తేదీన ప్రకటిస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications