మాతో వస్తే కష్టాలు: విజయమ్మ, జగన్ పార్టీలోకి వనిత

వాటిని భరించక తప్పదని, అన్నింటికి సిద్దపడాలని సూచించారు. ఇబ్బందులు ఉంటాయని తెలిసి వచ్చిన వారు పార్టీ కోసం గట్టిగా కృషి చేయాలన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడూ ప్రజల్లో ఉండేందుకు ఇష్ట పడేవారని, జగన్ కూడా ఆయనను ఆదర్శంగా తీసుకున్నారని, నేతలు కూడా అలాగే ఉండాలన్నారు. జగన్ అడ్డంకులు అధిగమించి బయటకు వస్తారని, ప్రజల మధ్య ఉంటారని, రాజన్న పాలన అందిస్తారన్నారు.
జగన్ను ముఖ్యమంత్రిగా చేయడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని కృష్ణబాబు అన్నారు. గతంలో టిడిపిలో ఎలాగైతే బాధ్యతలు తీసుకొని పని చేశానో 2014 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు కోసం కూడా అంతే పని చేస్తానన్నారు. ఎన్టీఆర్ టిడిపిని హుందాగా నడిపితే, చంద్రబాబు దాన్ని కులం, కుటుంబ పార్టీగా మార్చేశారని ధ్వజమెత్తారు. జగన్ను కేసుల్లో ఇరికించినా బయటకు వస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ 200 స్థానాలు గెలుచుకోవడం ఖాయమన్నారు.
తాను చాలాకాలంగా కమ్మ సామాజిక వర్గం కోటాలో రాజ్యసభ సీటు ఇవ్వాలని బాబును కోరుతూ వస్తున్నానని, కానీ ఎప్పుడూ అవకాశం కల్పించలేదన్నారు. సుజనా చౌదరికి సీటు ఇవ్వడం తనకు ఆగ్రహం తెప్పించిందన్నారు. డబ్బులు ఖర్చు చేసిన వారికే పదవులు కట్టబెడుతున్నారని విమర్శించారు. తనను పార్టీ నుండి అకారణంగా బహిష్కరించారని వనిత ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుండి నియోజకవర్గంలో ఓ వర్గం తనను నిత్యం వేధించడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications