ఐటం గర్ల్ రాఖీ సావంత్తో ఫైట్కు దిగ్విజయ్ సై
కేజ్రీవాల్ను తనతో పోల్చడంపై రాఖీ సావంత్ దిగ్విజయ్ సింగ్పై మండిపడుతున్నారు. తన పరువుకు నష్టం కలిగించారంటూ రాఖీ సావత్ ముంబై పోలీసు కమిషనర్కు, మహారాష్ట్ర హోం సెక్రటరీకి లేఖలు రాసినట్లు సమాచారం. దిగ్విజయ్ సింగ్కు మతి తప్పిందని రాఖీ సావంత్ ఆదివారంనాడు వ్యాఖ్యానించారు.
అందమైన, మేధావిగా తాను దిగ్విజయ్ సింగ్ను అభిమానిస్తూ వచ్చానని, అయితే ఈ రోజు తనపై దాడి చేశారని, కేజ్రీవాల్ను కాల్చడానికి తన భుజంపై తుపాకి పెట్టారని, కేజ్రీవాల్తో తనను పోల్చడం తగదని ఆమె అన్నారు.
దిగ్విజయ్ సింగ్, అరవింద్ కేజ్రీవాల్ల వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అలాంటప్పుడు తనను వారి వివాదంలోకి ఎందుకు లాగుతారని రాఖీ సావంత్ మండిపడింది. తానేంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదంది. తనను వివాదంలోకి లాగిన విషయంపై ఎలా తేల్చుకోవాలో తనకు తెలుసునని ఆగ్రహం వ్యక్తం చేసింది.
అంతకుముందు దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్లో సామాజిక సంస్కర్త అరవింద్ కేజ్రీవాల్ను రాఖీ సావంత్తో పోల్చారు. కేజ్రీవాల్.. రాఖీ సావంత్ వంటి వాడని, వారిద్దరికీ హడావిడే తప్ప వారిలో ఎలాంటి మ్యాటర్ ఉండదని ట్వీట్ చేశాడు.