టిడిపి ఎమ్మెల్యే: జగన్ను కలిశారు, సస్పెండ్ అయ్యారు
రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు ఉన్నాయని, వాటితో తాను విసుగు చెందానన్నారు. తన నియోజకవర్గంలో తనను కాదని మరో ప్రత్యామ్నాయాన్ని తెలుగుదేశం పార్టీ ప్రోత్సహిస్తోందని, అందుకే తాను ఆ పార్టీలో కొనసాగడం కష్టంగా భావిస్తున్నానని చెప్పారు. టిడిపిని స్థాపించినప్పటి నుండి తాను అదే పార్టీలో ఉన్నానని, అలాంటి టిడిపిని వీడాల్సి వస్తుందని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు.
ఇటీవల తెలుగుదేశం ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుందని, తాను జగన్ పార్టీలో చేరేందుకు ఇవే ప్రేరేపించాయన్నారు. తన నియోజకవర్గ ప్రజల కోరిక మేరకే తాను జగన్ పార్టీలో చేరాలనుకుంటున్నానని చెప్పారు. తనపై టిడిపి బురద జల్లే ప్రయత్నాలు చేస్తోందన్నారు. అమర్నాథ్ రెడ్డి నియోజకవర్గంలో టిడిపి శ్రేణులు నిరసనలు తెలుపగా, వైయస్సార్ కాంగ్రెసు శ్రేణులు ఉత్సాహంగా కనిపించాయి.
జగన్ను కలిసిన విజయమ్మ, భారతి
జైలులో ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, భార్య భారతి రెడ్డి కలిశారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జగన్ కూడా షర్మిల పాదయాత్ర గురించి, ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
అమర్నాథ్ రెడ్డి సస్పెన్షన్
జైలులో ఉన్న జగన్ను పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కలిశారని తెలియగానే తెలుగుశం పార్టీ ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెబుతూ వారు అతనిపై వేటు వేశారు.