గాలికి భంగపాటు: విజయసాయి రెడ్డి పిటిషన్
ఇదిలావుంటే, తన బెయిల్ షరతులను సడలించాలని కోరుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో నిందితుడైన జగతి పబ్లికేషన్స్ వైస్ ప్రెసిడెంట్ విజయసాయి రెడ్డి సోమవారం పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాదు విడిచి వెళ్లరాదనే నిబంధనలను సడలించాలని ఆయన కోర్టును కోరారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో విజయసాయి రెడ్డి ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) విచారణ నిమిత్తం ఢిల్లీ వెళ్లి వస్తున్నారు.
వాన్పిక్ వ్యవహారంలో అరెస్ట్ అయిన మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ, ఓఎంసీ కేసు నిందితుడు రాజ్గోపాల్కు హైకోర్టులో చుక్కెదురైంది. వీరు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. వైయస్ జగన్కు చెందిన వాన్పిక్ వ్యవహారంలో అరెస్టయిన తర్వాత మోపిదేవి వెంకటరమణ మంత్రి పదవికి రాజీనామ చేశారు. వాన్పిక్ వ్యవహారంలో ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కూడా అరెస్టయ్యారు.