జగన్ను రక్షించేందుకే క్లీన్ చిట్: రేవంత్, గవర్నర్పై ఫైర్

ధర్మాన పైన గవర్నర్ నరసింహన్ చర్యలు తీసుకోవాలని సూచించారు. గవర్నర్ భవనంను గాంధీ భవనంగా మార్చేశారని మండిపడ్డారు. ధర్మాన వ్యవహారంపై కలిసేందుకు తాము ప్రయత్నిస్తే గవర్నర్ తమకు అపాయింటుమెంట్ ఇవ్వలేదన్నారు. రాజ్యాంగ బద్ధ అధికారాలతో ధర్మాన పైన గవర్నర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వాలు జగన్ను కాపాడే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. గవర్నర్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి గూఢచారిగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదన్నారు. ముఖ్యమంత్రి, గవర్నర్ ఇద్దరూ అవినీతిపరులను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. ఎఫ్డిఐలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. గిరిజన హక్కులను కాపాడాలన్న కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ లేఖపై గవర్నర్ ఎందుకు స్పందించడం లేదన్నారు.












Click it and Unblock the Notifications