హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కు క్షమాపణ చెప్పాలి: జూపూడి, సిబిఐపై విమర్శ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jupudi Prabhakar Rao
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ కోరినప్పుడల్లా సిబిఐ విచారణ పేరిట సమయం కోరుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, శాసనమండలి సభ్యుడు జూపూడి ప్రభాకర రావు మంగళవారం అన్నారు. జగన్‌కు అశేష ప్రజాధరణ ఉందన్నారు. జగన్‌ను అరెస్టు చేసి ఆరు నెలలు దాటినా విచారణ కోసం ఇంకా మూడు నెలలు పడుతుందని సిబిఐ డైరెక్టర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

జగన్‌పై కుట్ర చేస్తే నియంతలకు పట్టిన గతే కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు పడుతుందన్నారు. సిబిఐ మ్యాన్యూవల్‌ను కూడా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. జగన్ విషయంలో సిబిఐ వ్యక్తిగత కక్షతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పులను కూడా సిబిఐ విస్మరించడమేమిటన్నారు.

జివోలు అన్నీ సరైనవేనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారని, అలాంటప్పుడు క్విడ్ ప్రోకో ఎక్కడదని ప్రశ్నించారు. జివోలు సరైనవని కోర్టుకు ఎందుకు తెలియజేయరన్నారు. సిబిఐ అధికారులు యుపిఎస్‌సి ద్వారా నియమితులయ్యారా లేక రాజకీయ పార్టీల ద్వారా అయ్యారా చెప్పాలన్నారు.

ప్రజా కోర్టులో జగన్‌దే అంతిమ విజయం అన్నారు. కాంగ్రెసు, టిడిపిలు కుమ్మక్కై జగన్ పైన ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు క్షమించరన్నారు. సుప్రీం కోర్టులో భవిష్యత్తులో క్విడ్ ప్రోకో లేదని ప్రభుత్వం చెబితే అక్షింతలు వేసి జగన్‌కు క్షమాపణ చెప్పి ఇంటికి పంపించవలసి ఉంటుందన్నారు.

జగన్‌కు బెయిల్ రాకుండా కాంగ్రెసు, టిడిపిలు పథకం ప్రకారమే కుట్ర చేస్తున్నాయని తిరుపతి శాసనసభ్యుడు, మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.

English summary
YSR Congress party leader and MLC Jupudi Prabhakar Rao has blamed CBI investigation in YSR Congress party chief YS Jaganmohan Reddy's DA case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X