కెసిఆర్కు ఇదే నా సవాల్, రావాల్సిందే: మందకృష్ణ

ఉద్యమాల పేరుతో తెలంగాణ ప్రజలను అణువణువునా మోసం చేస్తున్న తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు బొంతపురుగు కన్నా హీనమైన వ్యక్తి అని మందకృష్ణ మాదిగ విమర్శించారు. సోమవారం సికింద్రాబాద్ పార్శిగుట్ట రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు రాజెల్లయ్య మాదిగ, వంగపల్లి శ్రీనివాస్, వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అందె రాంబాబులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
మంత్రి గీతారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరాం బహిరంగ క్షమాపణ చెప్పారని, అయితే కోదండరాంను సమర్థించిన కేసీఆర్ను వదిలిపెట్టేది లేదని ఆయన అన్నారు. ఆదివారం నాటి తెలంగాణ సమరభేరి సభలో కేసీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కేసీఆర్కు దళిత ముఖ్యమంత్రి పేరు ప్రకటించడం తెలియదా? అని మందకృష్ణ ప్రశ్నించారు.
గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కెసిఆర్ ఇప్పటివరకు పేరు ప్రకటించకపోవడం విడ్డూరమన్నారు. తెలంగాణలో కేసీఆర్ నిర్వహించిన చోటల్లా తాము బహిరంగ సభలు నిర్వహిస్తామని సవాల్ విసిరారు.
వృద్ధులు, వితంతువుల పింఛన్లు వేయి రూపాయలు పెంచనట్లయితే ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి సంగతి తేలుస్తామని మందకృష్ణ హెచ్చరించారు. వచ్చే 17న హైదరాబాద్లో జరిగే సభలో ఈ సంగతి తేల్చుకుంటామన్నారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడిస్తామన్నారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications