కెసిఆర్కు ఇదే నా సవాల్, రావాల్సిందే: మందకృష్ణ

ఉద్యమాల పేరుతో తెలంగాణ ప్రజలను అణువణువునా మోసం చేస్తున్న తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు బొంతపురుగు కన్నా హీనమైన వ్యక్తి అని మందకృష్ణ మాదిగ విమర్శించారు. సోమవారం సికింద్రాబాద్ పార్శిగుట్ట రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు రాజెల్లయ్య మాదిగ, వంగపల్లి శ్రీనివాస్, వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అందె రాంబాబులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
మంత్రి గీతారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరాం బహిరంగ క్షమాపణ చెప్పారని, అయితే కోదండరాంను సమర్థించిన కేసీఆర్ను వదిలిపెట్టేది లేదని ఆయన అన్నారు. ఆదివారం నాటి తెలంగాణ సమరభేరి సభలో కేసీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కేసీఆర్కు దళిత ముఖ్యమంత్రి పేరు ప్రకటించడం తెలియదా? అని మందకృష్ణ ప్రశ్నించారు.
గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కెసిఆర్ ఇప్పటివరకు పేరు ప్రకటించకపోవడం విడ్డూరమన్నారు. తెలంగాణలో కేసీఆర్ నిర్వహించిన చోటల్లా తాము బహిరంగ సభలు నిర్వహిస్తామని సవాల్ విసిరారు.
వృద్ధులు, వితంతువుల పింఛన్లు వేయి రూపాయలు పెంచనట్లయితే ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి సంగతి తేలుస్తామని మందకృష్ణ హెచ్చరించారు. వచ్చే 17న హైదరాబాద్లో జరిగే సభలో ఈ సంగతి తేల్చుకుంటామన్నారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడిస్తామన్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications