'జగన్ను వదిలేయకపోతే జైలు గోడలు బద్దలు కొడ్తాం'

రైతు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, నీలం తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తోందని ఆయన విమర్శించారు. రైతాంగానికి మేలు జరగాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందనని అన్నారు. రైతు నాయకుడైన జగన్ను ప్రభుత్వం కుట్రతో జైల్లో పెట్టిందని, జగన్ను తక్షణమే విడుదల చేయకపోతే ప్రజలు తిరగబడతారని ఆయన అన్నారు.
అవసరమైతే జైలు గోడలు బద్దలు కొట్టి ఆయన్ను బయటకు తీసుకువస్తామని ఉదయభాను అన్నారు. వైసీపీ నాయకులు దేవినేని చంద్రశేఖర్, జి.వి.ప్రసాదరావు, కోవెలమూడి వెంకటనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
హైదరాబాద్ జోలికి వస్తే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును రాయలసీమ, ఆంధ్ర ప్రజలు తరిమి కొడతారని, అప్పుడు కెసిఆర్ కాపాడమని తనవద్దకు రావాల్సి వస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ కన్వీనర్, మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ అన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సోమవారం రాత్రి జరిగిన గడపగడపకు వైసీపీ ముగింపుసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. షర్మిలపాదయాత్రను చూసి కెసిఆర్కు నిద్ర పట్టడం లేదన్నారు.
కెసిఆర్ పెద్ద వెధవని, తెలంగాణ కెసిఆర్ అబ్బ సొత్తు కాదన్నారు. తెలంగాణ వస్తే కెసిఆర్ తెచ్చేది నీళ్ళు కాదు కల్లు తెస్తాడని వ్యాఖ్యానించారు. కలెక్షన్, కన్ర్స్టక్షన్, ఎలక్షన్ మాత్రమే కేసీఆర్కు తెలుసునని విమర్శించారు. త్వరలో కేసీఆర్ బండారం బయట పెడతానని తెలిపారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications