హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేబినెట్లో ప్రోటోకాల్: సిఆర్సీకి అనం అండ: డిఎల్ మౌనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy-C Ramachandraiah
హైదరాబాద్: కేబినెట్ సమావేశం బుధవారం కొద్దిగా హాట్ హాట్‌గా సాగింది. గత కేబినెట్ సమావేశంలో మంత్రి ధర్మాన ప్రసాద రావు వ్యవహారం లేవనెత్తిన డిఎల్ ఈసారి మౌనంగా ఉన్నారు. రామచంద్రయ్య ప్రోటోకాల్ వివాదాన్ని తీసుకు వచ్చారు. అధికారుల తీరుపై రామచంద్రయ్యకు ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మద్దతు పలికారు. సిఆర్సీ, ఆనంల అసంతృప్తి కారణంగా ముఖ్యమంత్రి అధికారులను హెచ్చరించారు.

తన శాఖకు సంబంధించిన కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటున్నప్పటికీ అధికారులు సమాచారం ఇవ్వడం లేదని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూపై దేవాదాయ శాఖ మంత్రి సిఆర్సీ ఫిర్యాదు చేశారు. అదే సమయంలో.. సీనియర్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జోక్యం చేసుకొని.. సిఎస్ తీరు బాగాలేదని, సిఎం సమక్షంలో ప్రొటోకాల్ అంశం చర్చకు రావడం భావ్యం కాదని, ఇది మొదటిసారి కాదని కాదన్నారు.

తర్వాత నీలం తుఫానుపై చర్చించారు. బాధితులకు పరిహారం చెల్లింపు పెంపుపై 30లోగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పిస్తూ ముసాయిదా బిల్లులో ఉన్న అంశాలను ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ కేబినెట్ సహచరులకు వివరించారు.

English summary
Minister C Ramachandraiah raised protocol issue in Cabinet meeting on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X