యాత్రలో వైయస్ను తల్చుకొని కంటతడి పెట్టిన షర్మిల

విగ్రహాన్ని చూసిన షర్మిల తన తండ్రిని గుర్తుకు తెచ్చుకొని ఉద్వేగానికి లోనై కంట తడి పెట్టారు. అనంతరం తమాయించుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడారు. జలయజ్ఞంలో భాగంగా వైయస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన నెట్టంపాడు ప్రాజెక్టు పూర్తయితే రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుందని ఆమె అన్నారు. వైయస్ మృతి తర్వాత ఆయన ఆశయాలు నెరవేరట్లేదని కాంగ్రెసు ప్రభుత్వంపై విమర్శించారు.
కాగా షర్మిల పాదయాత్ర గురువారం నెట్టెంపాడు నుండి ప్రారంభమైంది. ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం ఆమె తన పాదయాత్రను వామనపల్లి మీదుగా చేశారు. గురువారం షర్మిల 17 కిలోమీటర్లు నడవనుంది. షర్మిల పాదయాత్ర మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతోంది. అనంతరం ఆమె పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశిస్తుంది.












Click it and Unblock the Notifications