మాజీ ప్రధానమంత్రి ఐకె గుజ్రాల్ కన్నుమూత

గుజ్రాల్ దివంగత ప్రధాని ఇందిరా గాంధీ మంత్రివర్గంలో సమాచార శాఖ మంత్రిగా, విపి సింగ్, దేవేగౌడ్ కేబినెట్లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. రష్యాలో భారత రాయబారిగా పని చేశారు. కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు బుధవారం తెలిపారు. ఈ రోజు ఉదయం గూర్గాన్లో మృతి చెందాడు.
రాజ్యసభ నుండి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారిలో గుజ్రాల్ రెండోవారు. ఆయన కంటే ముందు హెచ్డి దేవేగౌడ రాజ్యసభ నుండి ప్రధానిగా పని చేశారు. కాంగ్రెసులో పని చేసి ఇందిరా గాంధీ కేబినెట్లో మంత్రిగా పని చేసిన గుజ్రాల్ ఆ తర్వాత జనతా దళ్ పార్టీలో చేరారు. గుజ్రాల్ 1989లో జలంధర్ నుండి లోకసభకు ఎన్నికయ్యారు. ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ను గుజ్రాల్ వ్యక్తిగతంగా కలిశారు.
గుజ్రాల్ తనయుడు నరేష్ అగర్వాల్ శిరోమణి అకాలీదళ్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. గుజ్రాల్ ఓ ఖచ్చితమైన సిద్ధాంతంతో ముందుకు వెళతారనే పేరు ఉంది. 1989లో శ్రీనగర్లో జరిగిన కిడ్నాప్ కేసును చేధించేందుకు విపి సింగ్ అప్పుడు గుజ్రాల్ను పంపించారు.












Click it and Unblock the Notifications