కర్నాటకం: యడ్డీ బలప్రదర్శన, జెడి(ఎస్)వైపు బిజెపి..

భారీగా బిజెపి ప్రజాప్రతినిధులను తన సమావేశానికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే తన వైపు యాభై మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన పలుమార్లు ప్రకటనలు కూడా చేశారు. యడ్డీ భయంతో బిజెపి రాష్ట్రంలోని జగదీష్ శెట్టార్ ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో పడింది. ఇందుకోసం జెడి(ఎస్)తో మంతనాలు సాగిస్తోంది. ఆ పార్టీతో పొత్తు ప్రయత్నాలు చేస్తోంది.
యడ్డీ వైపు వెళ్తున్న మంత్రులను ఇప్పటికే ఆ పదవుల నుండి తొలగించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలను సస్పెండ్ చేశారు. యడ్డీ సభకు ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్లకుండా ఉండేందుకే బిజెపి అధిష్టానం వ్యూహాత్మకంగా వారిపై వేటు వేసింది. యడ్డీకి విధేయులుగా ఉన్న ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేసింది. సహకార మంత్రి పుట్టస్వామిని పదవి నుండి తొలగించింది. తుమకూరు ఎంపీ బసవరాజును పార్టీ నుండి సస్పెండ్ చేసింది.
తన వర్గం ఎమ్మెల్యేలపై వేటు వేయడంపై యడ్డీ తీవ్రంగా స్పందించారు. బిజెపి తన వర్గం నేతలపై వేటు వేస్తోందని, అయినప్పటికీ పలువురు పాల్గొనేందుకు ఉత్సాహంగా ఉన్నారన్నారు. తనకు జగదీష్ శెట్టార్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని లేదని, పూర్తి కాలం కొనసాగనిస్తానని చెప్పారు. అయితే బిజెపి తన వర్గం నేతలపై చర్యలు తీసుకుంటే మాత్రం జరగబోయే పరిణామాలకు తాను బాధ్యుడిని కాదన్నారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications